రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Nov 30, 2022 1:15 AM IST

రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీని తరువాత తన నెక్స్ట్ మూవీ ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన తో చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ప్రచారం అవుతోంది. ఈ మూవీని భారీ స్థాయి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు దర్శకుడు బుచ్చిబాబు సిద్ధం అవుతున్నారని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ మూవీలో పలు చిత్ర పరిశమ్రలకు చెందిన దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని సైతం ఆకట్టుకునేలా ఈ స్క్రిప్ట్ సిద్ధం అయిందట. కాగా ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు