SSMB 29 మూవీ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్

SSMB 29 మూవీ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్

Published on Feb 4, 2023 7:00 PM IST


ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28 మూవీ చేస్తున్నారు మహేష్ బాబు. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే దీని తరువాత తొలిసారిగా తన కెరీర్ లో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో భారీ పాన్ ఇండియన్ మూవీ చేయనున్నారు మహేష్ బాబు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎప్పటి నుండో ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కాగా గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీ గా ఇండియానా జోన్స్ రేంజ్ లో దీనిని తెరకెక్కించనున్నట్లు ఇటీవల రాజమౌళి తెలిపారు. అయితే తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది జూన్ లో ప్రారంభం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కోసం పవర్ఫుల్ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారని, అతి త్వరలో పూర్తి అయిన అనంతరం సినిమాని వీలైనంత త్వరలో మొదలెట్టాలని జక్కన్న అండ్ టీమ్ ఆలోచన చేస్తోందట. అయితే ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు