“వారిసు” గ్రాండ్ ఈవెంట్ డేట్ మారిందా?

“వారిసు” గ్రాండ్ ఈవెంట్ డేట్ మారిందా?

Published on Dec 14, 2022 3:00 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం “వారిసు”. తెలుగు వారసుడు పేరిట రిలీజ్ చేయనున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా విజయ్ సినిమాలు అయితే ఎప్పుడు ప్రీ రిలీజ్ కాకుండా ఆడియో ఫంక్షన్ చేస్తూ ఉంటారని తెలిసిందే. అలాగే వారిసు కి ఊదా ఆడియో ఫంక్షన్ నే మేకర్స్ గ్రాండ్ గా తమిళ్ లో ప్లాన్ చేశారు.

అయితే దీనిని మొదటగా క్రిస్మస్ కి ముందు డిసెంబర్ 24న చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ డేట్ మారినట్టుగా బజ్ వినిపిస్తుంది. బహుశా ఇది ఈ నెలాఖరుకి షిఫ్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనితో అయితే ఈ డిసెంబర్ 28 లేదా 29 నుంచి ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు