“దృశ్యం 3” తో ఈ ఫ్రాంచైజ్ ముగియనుందా.?

“దృశ్యం 3” తో ఈ ఫ్రాంచైజ్ ముగియనుందా.?

Published on Aug 14, 2022 9:00 AM IST

సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మళయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకి ఒకింత ప్రత్యేక ఆదరణ ఉంటుంది అని చెప్పాలి. చాలా రియలిస్టిక్ గా అందులోని ఊహించని స్టోరీ లైన్స్ తో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారు ఈ సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. అయితే అక్కడ బిగ్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ కెరీర్ లో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాల్లో దర్శకు జీతూ జోసెఫ్ తో చేసిన సినిమాలు “దృశ్యం” పార్ట్ 1 పార్ట్ 2 లు కూడా ఒకటి.

అయితే ఈ రెండు సినిమాలు తర్వాత ఇంకో సీక్వెల్ కూడా ఉండడంతో దానిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు దీనిపై అయితే ఓ క్లారిటీ బయటకి వచ్చి వైరల్ గా మారింది. కొత్త పోస్టర్ ఒకటి మోహన్ లాల్ పై కనిపిస్తుండగా ఈ మూడో సినిమాతో ఈ సిరీస్ కి ఎండ్ కార్డ్ దర్శకుడు జీతూ జోసెఫ్ ఇవ్వనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు