టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ పై ఐటీ దాడులు

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ పై ఐటీ దాడులు

Published on Dec 12, 2022 5:19 PM IST

చాలా కొద్ది సమయంలోనే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది. తెలుగులో టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేస్తూ వస్తున్నారు నిర్మాతలు. తాజా వార్తల ప్రకారం, గత కొన్ని గంటలుగా వారి కార్యాలయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సంవత్సరం వారి స్వంత డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అయిన రెండు అతిపెద్ద చిత్రాలు వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు