డల్ కలెక్షన్స్ తో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ !

డల్ కలెక్షన్స్ తో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ !

Published on Nov 28, 2022 12:30 PM IST

అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో మొదటి రోజు కలెక్షన్లు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే, వీకెండ్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్లిక్ కాలేదు. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. ఈ సినిమాకి పోటీగా వచ్చిన మరో చిత్రం ‘లవ్ టుడే’ హిట్ కావడంతో ఆ సినిమా పైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మొత్తమ్మీద ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ప్రస్తుతం కష్టాలోనే ఉంది. ఈ వారం రోజుల్లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేయాలి. లేదంటే నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, స్లో నేరేషన్ సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు