నా వంతు సాయం నేను చేసేశాను, ఇక మీ వంతు.. !

తిత్లీ’ బీభత్సం కారణంగా సిక్కోలులోని ప్రజలు గత కొని రోజులుగా తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోతుతున్న విషయం తెలిసిందే. వారి బాధకి తెలుగు సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.లక్ష ను తిత్లీ బాధితుల‌కు సహాయంగా… విరాళాలు ప్రకటించి.. సిక్కోలులోని ప్రజలకు అండగా నిలబడ్డారు.

కాగా తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన వంతు సాయంగా తిత్లీ బాధితుల‌కు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సమయం మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయం. ఇప్పటికే నా వంతు సాయం నేను చేసేశాను. అయితే నా నుండి ప్రతి ఒక్కరికీ ఒక రిక్వెస్ట్.. ఆంధ్రాలోని తిత్లీ బాధితులు ఇళ్లను తిరిగి నిర్మిచుకోవడానికి వారికి కావల్సిన ఆర్థిక సాయం చేయండి’’అని వరుణ్ పోస్ట్ చేశాడు.

Exit mobile version