జాక్వెలిన్ తప్పేం లేదు.. నేనే గిఫ్ట్ లు ఇచ్చా – సుకేష్ చంద్రశేఖర్

జాక్వెలిన్ తప్పేం లేదు.. నేనే గిఫ్ట్ లు ఇచ్చా – సుకేష్ చంద్రశేఖర్

Published on Oct 23, 2022 6:37 PM IST

సుకేష్ చంద్రశేఖర్ గురించి అందరికీ తెలిసిందే. రూ.200 కోట్ల దోపిడీ కేసులో అతను నిందితుడు. అయితే, సుకేష్ చంద్రశేఖర్ కు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడైతే స్కామ్ లో సుకేష్ చంద్రశేఖర్ అడ్డంగా బుక్ అయ్యాడో.. అప్పటి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ చుట్టూ అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అయితే, తాజాగా తన ప్రియురాలను తన కేసులో ఇరికించడం పై సుకేష్ చంద్రశేఖర్ స్పందించాడు.

సుకేష్ చంద్రశేఖర్ తన న్యాయవాది ద్వారా ఒక లేఖను విడుదల చేశాడు. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొనడం “చాలా దురదృష్టకరమైన ఆరోపణ” అని పేర్కొన్నాడు. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని చెప్పాడు. తాను ఆమెకు, ఆమె కుటుంబానికి గిఫ్టులు ఇస్తే అందులో వారి తప్పేమిటని సుకేష్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు. పైగా జాక్వెలిన్ తన నుంచి ప్రేమను మాత్రమే కోరుకుందని, ఇంకేమీ అడగలేదని సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో రాశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు