దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో సూర్య “జై భీమ్” కి అవార్డ్స్

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో సూర్య “జై భీమ్” కి అవార్డ్స్

Published on May 3, 2022 8:00 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఓటిటి చిత్రం జై భీమ్ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల నుండి అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నాయి. తాజా వార్త ఏమిటంటే, TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన కోర్ట్‌రూమ్ డ్రామా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2022 లో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ సహాయ నటుడు అవార్డులను గెలుచుకుంది.

ఈ చిత్రంలో బాధితుడిగా నటించిన మణికందన్‌కు అవార్డు దక్కడం హాట్ టాపిక్ గా మారింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ లీగల్ డ్రామాలో రావు రమేష్, రజిషా విజయన్, లిజోమోల్ జోస్, ప్రకాష్ రాజ్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జై భీమ్ 3 అవార్డులను గెలుచుకుంది మరియు ఆస్కార్స్ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు