నైజాంలో 17 కోట్ల మార్క్ దాటిన ‘జనతా గ్యారేజ్’!

నైజాంలో 17 కోట్ల మార్క్ దాటిన ‘జనతా గ్యారేజ్’!

Published on Sep 16, 2016 6:09 PM IST

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాతో తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. మూడో వారం కూడా ‘జనతా గ్యారేజ్’ స్థాయికి తగ్గ సినిమాలేవీ లేకపోవడంతో కలెక్షన్స్ ఇంకా బాగానే ఉన్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే ఇప్పటివరకూ ఈ సినిమా 17 కోట్లకు పైగా షేర్ సాధించింది. నైజాంలో ఎన్టీఆర్ కెరీర్‌కు ఇదే పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ లీగ్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ని ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు