ఎన్టీఆర్ సినిమాకే జాన్వీ కపూర్ ప్రాధాన్యత

ఎన్టీఆర్ సినిమాకే జాన్వీ కపూర్ ప్రాధాన్యత

Published on Feb 7, 2023 7:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అంటూ నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు. కాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఆమె ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే ఇప్పుడు రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం, జాన్వీ అన్నింటికంటే ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. డేట్స్ కూడా ఈ సినిమాకి ఎక్కువ కేటాయించింది. ఈ చిత్రం జాన్వీకి తొలి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం జాన్వీ చాలా ఉత్సాహంగా ఉందట.

ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు