కొత్త వాళ్ళతో స్టార్ డైరెక్టర్ సినిమా!

కొత్త వాళ్ళతో స్టార్ డైరెక్టర్ సినిమా!

Published on Sep 18, 2016 7:23 PM IST

jayanth-c-paranjee
చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, ‘తీన్మార్’ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. కొద్దిరోజుల క్రితం ‘కాళహస్తి’ పేరుతో ఓ సినిమా మొదలుపెట్టినా, అది కూడా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు. అయితే తాజాగా జయంత్ తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ‘ఉగ్రం’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాతో నిలీష్, ఇసబెల్‌లను జయంత్ హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు.

ముంబై నేపథ్యంలో నడిచే ఈ కథ ఎక్కువ భాగం ముంబైలో, హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావచ్చిందని దర్శకుడు జయంత్ తెలిపారు. నవంబర్ నెలలో ఉగ్రం సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక కొత్తవాళ్ళతో చేస్తోన్న సినిమా అయినా ప్రొడక్షన్ రిచ్‌గా ఉంటుందని జయంత్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు