ఓటీటీలోకి జయ్యమ్మ పంచాయితీ.. ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి జయ్యమ్మ పంచాయితీ.. ఎప్పటినుంచంటే?

Published on Jun 11, 2022 11:02 PM IST

యాంకర్‌ సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్‌ నిర్మించారు. దినేష్‌ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అదించారు. మే6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పర్వాలేదనిపించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ సహజ నటనతో మెప్పించింది.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌ కాబోతోంది. జూన్‌ 14 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్‌ అయినవాళ్లు ఇంట్లోనే కూర్చుని జయమ్మ పంచాయితీ ఎలా ఉందో చూసేయొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు