ఎమోషనల్ మొమెంట్ : అభిమాని త్వరగా కోలుకోవాలని కాల్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

ఎమోషనల్ మొమెంట్ : అభిమాని త్వరగా కోలుకోవాలని కాల్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

Published on Jun 29, 2022 9:00 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బాలరామాయణం సినిమా చేసిన ఎన్టీఆర్, కొన్నేళ్ల తరువాత నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అక్కడి నుండి హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న ఎన్టీఆర్, తన అత్యద్బుత్నమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు. ఇక తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ మాదిరిగా మొదటి నుండి కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం గల ఎన్టీఆర్, తరచు మధ్యలో పలు సందర్భాల్లో తన అభిమానులు కొందరికి వీలైనంతలో చేయూతనందించారు. అలానే వారితో ఎప్పుడూ ఆయన అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇక తాజాగా జనార్దన్ అనే అభిమాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించడంతో అతడికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది. వీలైతే ఒకసారి ఎన్టీఆర్ తో మాట్లాడించమని జనార్దన్ తల్లి కోరడంతో ఈ విషయం పలువురు అభిమానులు ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎన్టీఆర్, జనార్దన్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి నువ్వు త్వరగా కోలుకుని మా ముందుకు ఆనందంగా తిరిగిరావాలి, అలానే ఆపైన నేను నిన్ను ప్రత్యేకంగా కలుస్తాను, అప్పటివరకు నువ్వు ఏమాత్రం అధైర్య పడవద్దు అంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఈ విధంగా తనకు ప్రియమైన అభిమానుల పట్ల మరొక్కసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు ఎన్టీఆర్. కాగా ప్రస్తుతం జనార్దన్ కి ఎన్టీఆర్ చేసిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు