‘మజ్ను’ డైరెక్టర్ తో నందమూరి హీరో !


ఉయ్యాల జంపాల లాంటి డిసెంట్ లవ్ స్టోరీతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన విరించి వర్మ మొదటి సినిమాతోనే విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు. కాగా విరించి వర్మ తన తరువాత సినిమాని త్వరలో మొదలు పెట్టనున్నట్లు తెలిస్తోంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విరించి వర్మ తన తరువాత సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిన విరించి మార్చిలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రటకన రానుంది.

Exit mobile version