ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తాను.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ !

ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తాను.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ !

Published on Oct 30, 2022 10:41 PM IST

వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. నిత్యం తనదైన శైలిలో విమర్శలతో రెచ్చిపోతూ ఉంటుంది కంగనా. అయితే, ఒక్కోసారి కంగనా చాలా కొత్తగా కూడా ఆలోచిస్తుంది. తాజాగా, ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్ రాజకీయాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు ఛాన్స్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉంది. దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను.

మోదీ వల్ల ప్రతీ ఒక్కరిలోనూ జాతీయ భావం పెరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, అలాగే బీజేపీ పార్టీ కోరుకుంటే.. నేను మండీ ప్రాంతం నుంచి పోటీ చేస్తాను’ అంటూ కంగనా చెప్పుకొచ్చింది. మరి బీజేపీ పార్టీ కంగనాకి ఎన్నికల్లో నిలబడే అవకాశం ఇస్తోందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు