కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ఏడాది భారీ హిట్ చిత్రాల్లో నటుడు రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే మొదట కన్నడలో రిలీజ్ కాగా నెక్స్ట్ ఈ చిత్రం తెలుగు సహా హిందీలో భారీ వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఈ చిత్రంలో టోటల్ గా అయితే మరో సెన్సేషనల్ మార్క్ ని వసూళ్ళలో ఈ చిత్రం అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు వారు కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు ఏకంగా 400 కోట్ల భారీ గ్రాస్ మార్క్ ని అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనితో అయితే కాంతారా నెలకొల్పిన సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.