రజిని కలవడంపై “కాంతారా” హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

రజిని కలవడంపై “కాంతారా” హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Oct 29, 2022 8:00 AM IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ సక్సెస్ అందుకున్నటువంటి చిత్రం “కాంతారా”. మరి హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం తాలూకా సెన్సేషన్ అయితే ఇంకా తగ్గలేదు. దీనితో ఈ చిత్రంకి అనేకమంది సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు ఇంకా కొనసాగుతుండగా సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే స్వయంగా రిషబ్ ని కలిసి అభినందించడం ఆసక్తిగా మారింది.

మరి దీనికి గాను హీరో రిషబ్ కూడా ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టాడు. “మీరు ఒక్కసారి మెచ్చుకుంటే 100 సార్లు మెచ్చుకున్నట్టు ధన్యవాదాలు రజినీ సార్, మా కాంతారా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని” రిషబ్ శెట్టి అయితే రజినీ స్టైల్ లోనే చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో ఈ ఇద్దరి కలయిక సెన్సేషన్ కాగా నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు