లేటెస్ట్ : తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ టీమ్ సక్సెస్ టూర్

లేటెస్ట్ : తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ టీమ్ సక్సెస్ టూర్

Published on Oct 28, 2022 2:07 AM IST

ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయి అక్కడ అదరగొడుతూ దూసుకెళ్తున్న బ్లాక్ బస్టర్ కాంతార మూవీ ఇటీవల తెలుగు సహా పలు ఇతర భాషల్లో సైతం రిలీజ్ అయి సూపర్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా కనిపించగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగందూర్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక తెలుగులో ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేయడం జరిగింది.

ఇక కాంతర మూవీ తెలుగు ఆడియన్స్ మనసు దోచి కోట్లాది రూపాయల కలెక్షన్ తో రోజు రోజుకు దిగ్విజయంగా కొనసాగుతుండడంతో మూవీ టీమ్ మన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రేక్షకాభిమానులకి కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్ధం అయింది. ముందుగా అక్టోబర్ 29 న జరిగే ఈ సక్సెస్ టూర్ ని తిరుపతిలో గల జయశ్యామ్ థియేటర్ కి ఉదయం 10 గం. 15 ని. లకు వెళ్లడంతో ప్రారంభించి, అనంతరం మధ్యాహ్నం 1 గం. 15 ని. లకు విజయవాడలోని రాజ్ యువ రాజ్ థియేటర్ కి, సాయంత్రం 5 గం. 15 ని. లకు విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ కి వెళ్లి అక్కడి ఆడియన్స్ ని కలుసుకోనున్నారు. మొత్తంగా ఈ సక్సెస్ టూర్ తో కాంతార కి తెలుగులో మరింతగా ప్రమోషన్ జరుగుతుందని, అలానే తద్వారా సినిమా మరింతమందికి రీచ్ అంవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు