నైజాం ఏరియా లో కొనసాగుతోన్న “కాంతార” జోరు!

నైజాం ఏరియా లో కొనసాగుతోన్న “కాంతార” జోరు!

Published on Oct 24, 2022 1:17 PM IST


రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా మంచి వసూళ్లను రాబడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిన్న ఆదివారం నాడు నైజాం ఏరియా లో 1.24 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది.

దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ రిలీజ్ చేయడం జరిగింది. కన్నడ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టడం మాత్రమే కాకుండా, బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు