మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర“

మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర“

Published on Mar 1, 2022 8:00 AM IST


భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన చిత్రం “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర”. తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందన్న సందేశాన్ని నేటి యువతకు తెలియచేస్తూ రూపొందించిన ఈ చిత్రానికి జి.జే రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.. యస్.పి. బాలసుబ్రమణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం. విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 4న విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర నిర్మాత ఉల్కందే కార్ మురళీధర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశామని, ప్రస్తుతం లవ్, రొమాన్స్ వంటి కథలు వస్తున్న నేపథ్యంలో నేటి యువత దైవత్వం సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇలాంటి తరుణంలో తల్లి తండ్రుల గొప్ప తనాన్ని నేటి యువతకు తెలియజేస్తూ తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని ఇస్తూ దారి తప్పే నేటి యువతకు దారి చూపే సినిమా “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర”. ఈ నెల 4న వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ త్రేతాయుగంలో జనక పురంలోని మిథిలా నగరంలో శ్రీహరి భక్తుడైన “శ్రీ ధర్మ వ్యాధుడు ధర్మములు సూక్ష్మ ధర్మములు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే కాక తన సొంత పిల్లలకు కూడా ధర్మం చెపుతూ వ్యక్తులు ఏ వృత్తి చేసినా తప్పు లేదు కానీ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణాన్ని మాత్రం మరవకూడదు. తల్లిదండ్రులు సేవలోనే శివపార్వతులు దర్శనం ఉందని ప్రజలకు తెలియజేసిన ధర్మవ్యాధుడు వంటి మహానుభావుడు చరిత్రను సినిమాగా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సీనియర్ నటులు అశోక్ కుమార్ మాట్లాడుతూ నా చిన్నతనంలో చదువుకున్న ఈ కథను సినిమాగా తీస్తామని నా దగ్గరకు రావడం జరిగింది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సినిమా తీయడం ఎంతో కష్టం అన్నాను. అయితే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే దృఢ నిక్ష్యయంతో మేము ఉన్నామని దర్శక, నిర్మాతలు ముందుకు వచ్చి ఎంతో తపనతో ఈ సినిమా తీయడం జరిగింది. ఇలాంటి మంచి చిత్రంలో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

చిత్ర హీరో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కృషారెడ్డి గారి సినిమా జాబిల్లి, 6 టీన్స్, మనసుతో, బతుకమ్మ, మహానగరంలో శివ చందు, నిన్నే కోరుకుంటా వంటి ఎన్నో సినిమాలు చేశాను. అలాగే సపోర్టింగ్ అరిస్టు గా చాలా సక్సెస్ ఫుల్ సినిమాలకు వర్క్ చేశాను. ఎన్నో రకాల పాత్రలు చేసినా ఇలాంటి పాత్ర చేయలేదు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి మంచి ఆధ్యాత్మికమైన సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ అనుషా మాట్లాడుతూ ఇలాంటి మైథలాజికల్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు 23 సినిమాలు చేశాను. మూడు సీరియల్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వాటికి గాను బెస్ట్ సింగర్ గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడు నంది అవార్డులు కూడా తీసుకున్నాను. అయితే ఇంతకు ముందు నేను జి.జె రాజాతో “రోజుకో రోజా”కు వర్క్ చేశాను. ఆ తరువాత మేము చేస్తున్న ఈ సినిమా ఎంతో వైవిధ్యమైనది. తల్లిదండ్రులను ప్రేమించాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఇంటికి అవసరమే ఈ మెసేజ్ ప్రతి ఇంటికి చేరాలి. పాటలన్ని కూడా ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఈ నెల 4న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు.

నటుడు అనంద్ భారతి మాట్లాడుతూ ఇందులో నేను మంచి పాత్ర చేశాను. ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చేయడానికి ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలు ధన్యవాదాలు. ఈ నెల 4న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

సినిమాటోగ్రఫర్ పి.దీవరాజ్ మాట్లాడుతూ దర్శక, నిర్మాతలు పట్టుదలతో ఎంతో కష్టపడి సినిమా తీశారు. ఇందులోని పాటలు చాలా బాగున్నాయి. ఇంత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు