“సర్దార్” తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన కార్తీ.!

“సర్దార్” తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన కార్తీ.!

Published on Nov 8, 2022 12:58 PM IST


లేటెస్ట్ గా టాలీవుడ్ సహా తమిళ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “సర్దార్” కూడా ఒకటి మరి ఈ చిత్రాన్ని దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించగా ఇక నెక్స్ట్ తన కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా ఇపుడు తన 25వ సినిమాని అనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని అయితే యువ దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించనుండగా ఈ చిత్రానికి మేకర్స్ “జపాన్” అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ అయితే ఫిక్స్ అయ్యింది. అలాగే ఈ చిత్రానికి అయితే ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ లాక్ కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించనున్నారు. మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఈరోజు పూజా కార్యక్రమంతో ఫార్మల్ గా లాంచ్ కాగా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు