రూ.100 కోట్లు కొల్లగొట్టిన కార్తీ ‘సర్ధార్’

రూ.100 కోట్లు కొల్లగొట్టిన కార్తీ ‘సర్ధార్’

Published on Nov 7, 2022 7:05 PM IST

కార్తీ హీరోగా యాక్షన్ థ్రిల్లింగ్ మూవీస్ డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో లేటెస్ట్ గా రూపొందిన మూవీ సర్ధార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రజీషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున విడుదల చేసారు.

అయితే రిలీజ్ అనంతరం తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది సర్ధార్ మూవీ. స్పై యాక్షన్ థ్రిలర్ గా రూపొందిన ఈ మూవీలో కార్తీ రెండు పాత్రల్లో కనిపించి తన అద్భుత నటీనతో హీరో కార్తీ ఆకట్టుకోగా ఆద్యంతం మూవీని మంచి కథ, కథనాలతో ముందుకి నడిపి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు డైరెక్టర్ పి ఎస్ మిత్రన్. ఇక ఈ మూవీ నేటితో వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా ప్రస్తుతం సర్దార్ మూవీ తమిళ్ లో ఇంకా పలు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే దీనికి సీక్వెల్ గా సర్ధార్ 2 ని అనౌన్స్ చేసిన మేకర్స్ వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు