“ది కశ్మీర్‌ ఫైల్స్” ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

“ది కశ్మీర్‌ ఫైల్స్” ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Published on Mar 17, 2022 1:00 AM IST


దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ త‌దిత‌రులు న‌టించిన హిందీ చిత్రం “క‌శ్మీర్ ఫైల్స్”. మార్చి 11న విడుద‌లైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబడుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఓటీటీ విడుదల తేదిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ రెండో వారంలో కాకుండా మే 6 నుంచి ఈ చిత్రాన్ని “జీ5″లో స్ట్రీమింగ్‌ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు