దర్శకుడు మెహర్ రమేష్ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో రాబోతున్న సినిమా టైటిల్ ను ‘భోళా శంకర్’గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి రాఖీ పండుగ సందర్బంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కీర్తి సురేష్ చిరుకి రాఖీ కడుతూ పోస్టర్ లో కనిపించారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ హెవీ ఎమోషనల్ గా ఉంటుందని.. కాగా ఈ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందని తెలిసిందే.
అయితే కీర్తి – చిరు మధ్య ట్రాక్ సినిమాలోనే హైలైట్ అవుతుందట. ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఎనిమిది సంవత్సరాల తరవాత మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నాడు. ఈ సారి చేయబోయే ‘భోళా శంకర్’ సినిమాతోనైనా మెహర్ రమేష్ లైఫ్ ఛేంజ్ అవుతుందేమో చూడాలి. మెహర్ రమేష్ అయితే, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు.