“కేజీయఫ్ 3” పై మరో క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ సభ్యుడు.!

“కేజీయఫ్ 3” పై మరో క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ సభ్యుడు.!

Published on May 15, 2022 7:06 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా అందరి అంచనాలు అందుకొని రికార్డు వసూళ్లను ఈ చిత్రం కొల్లగొట్టింది. అయితే నిన్ననే ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయింది.

ఈ సినిమా సీక్వెల్ పై డైరెక్ట్ గా హోంబలే నిర్మాతే ఒక క్లారిటీ ఇచ్చి ఈ ఏడాదిలోనే షూటింగ్ ఉంటుంది అని తెలపడంతో ఆ వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్ అయ్యింది. అయితే దీనిపై ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి కార్తిక్ గౌడ మరో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్పెక్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని కేజీయఫ్ చాప్టర్ 3 పై ఏదన్నా వార్త ఉంటే సమయం వచ్చినప్పుడు మేమే రివీల్ చేస్తామని అప్పటి వరకు ఏ ఇతర వార్తలు కూడా నమ్మవద్దని తాను తెలిపారు. దీనితో ఈ క్లారిటీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు