ఈ ఏడాదిలో మరో భారీ రిలీజ్ గా వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసిన ఈ భారీ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ క్రేజీ సీక్వెల్ వసూళ్ళ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.
మరి వాటికి సమాధానంగా ఫస్ట్ డే ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత రాబట్టిందో స్వయంగా చిత్రణ నిర్మాణ సంస్థ హోంబలే వారె అనౌన్స్ చేశారు. మరి వారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 134.5 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టు తెలిపారు.
మరి ఇది భారీ నంబర్ అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ వసూళ్లతో ఇండియాలో ఈ సినిమా మూడో అత్యధికం అని తెలుస్తోంది. మరి దీనికన్నా ముందు రాజమౌళి భారీ సినిమాలు రౌద్రం రణం రుధిరం మరియు బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి.
This is the biggest national issue now! ⚠️
Thank you, everyone ❤️#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/5NWmHKZqBw
— Hombale Films (@hombalefilms) April 15, 2022