మళ్లీ వార్తల్లోకెక్కిన ‘మహేష్ – రాజమౌళి’ సినిమా !

మళ్లీ వార్తల్లోకెక్కిన ‘మహేష్ – రాజమౌళి’ సినిమా !

Published on Feb 2, 2022 12:30 AM IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ అనుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి అండ్ ఆయన టీమ్ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఈ సినిమా గురించి ఏప్రిల్ లో అధికారిక ప్రకటన రానుంది.

ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. మొత్తానికి రాజమౌళి – మహేష్ సినిమా మళ్లీ వార్తల్లోకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు