మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది.
వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. కశ్మీర పర్ధేశీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా నుండి మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ కి సిద్ధం చేస్తుంది చిత్రబృందం. వాసవసుహాస అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి