యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’ నిన్ననే విడుదలైంది. చిత్ర యూనిట్ ముందు నుండి చేసిన ప్రమోషన్ల వలన, నిన్న విడుదలైన సినిమాల్లో ఇదే పెద్దది కావడం మూలాన చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జలు హీరోయిన్లుగా నటించారు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6.19 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా వసూళ్లను చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏరియా | వసూళ్లు |
నైజాం | 1.39కోట్లు |
సీడెడ్ | 78 లక్షలు |
ఉత్తరాంధ్ర | 45 లక్షలు |
ఈస్ట్ | 38 లక్షలు |
వెస్ట్ | 28 లక్షలు |
కృష్ణ | 31 లక్షలు |
గుంటూరు | 42 లక్షలు |
వైజాగ్ | 62 లక్షలు |
నెల్లూరు | 21 లక్షలు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 21 లక్షలు |
మొత్తం | 59 లక్షలు |