మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర బృందం.
అయితే గ్రామీణ నేపధ్యం, అడవి బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ సన్నివేశాలతో కూడుకున్న ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్లో ఈ ట్రైలర్ 3 మిలియన్కి పైగా వ్యూస్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి