ఎన్టీఆర్ తో తర్వాత మళ్లీ చరణ్ తోనే !

ఎన్టీఆర్ తో తర్వాత మళ్లీ చరణ్ తోనే !

Published on May 31, 2022 3:00 AM IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత కొరటాల చరణ్ తో సినిమా చేస్తాడట. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.

కాగా కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల చరణ్ తోనే సినిమా చేస్తాడట. ఆ తర్వాత బాలయ్య బాబుతో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు