టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “కోట బొమ్మాళి PS”

టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ కోట బొమ్మాళి PS. ఈ చిత్రం గతేడాది నవంబర్ 24 వ తేదీన థియేటర్ల లోకి వచ్చింది. ఆడియెన్స్ నుండి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. అయితే ఈ ఆదివారం నాడు సాయంత్రం 6:00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్ లు సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version