వైరల్ : పవన్ పై “ఖుషి” డైరెక్టర్ సాలిడ్ కామెంట్స్.!

వైరల్ : పవన్ పై “ఖుషి” డైరెక్టర్ సాలిడ్ కామెంట్స్.!

Published on Nov 27, 2022 12:11 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా “హరిహర వీరమల్లు” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా పవన్ కెరీర్ లో భారీ హిట్ ఇచ్చినటువంటి “ఖుషి” దర్శకుడు ఎస్ జే సూర్య కోసం తెలియని వారు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. మరి లేటెస్ట్ గా అయితే ఈ దర్శకుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పవన్ స్వచ్ఛమైన మనసు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు అని అలాగే పవన్ నాకు ఒక మంచి ఫ్రెండ్ నేను ఏదొక రోజు నా ఫ్రెండ్ ని సీఎం గా చూసి గర్వంగా ఫీలవుతానని ఎస్ జే సూర్య అయితే చేసిన కామెంట్స్ ఇప్పుడు మంచి వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అయితే ఎస్ జే సూర్య పలు తమిళ్ ప్రాజెక్ట్స్ తో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్ ల భారీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు