విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించారు. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విజయ్ సేతుపతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా నటించిన లాభం చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుందని అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం హ్యాపీగా ఉందని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు.