మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే “డాకు మహారాజ్”. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో అంచనాలు రీచ్ అయ్యే విధంగా సాలిడ్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా విషయంలో ఇంట్రస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ని ఉన్నట్టుగా చూపలేదు కానీ లేటెస్ట్ గా దీనిపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనితో ఈ చిత్రానికి ప్రీక్వెల్ సినిమా చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సినిమాలో కీలక పాయింట్ పై ఈ ప్రీక్వెల్ ని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రానున్నాయి.