“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ ఇన్ఫో..!

“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ ఇన్ఫో..!

Published on Nov 2, 2022 10:38 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. రీసెంట్ గా వచ్చిన టైటిల్ టీజర్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం వింటేజ్ బాస్ ని మళ్ళీ చూపించింది. ఇక దీనితో ఇక్కడ నుంచి చిత్ర యూనిట్ నిర్విరామంగా షూటింగ్ జరుపుతుండగా ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు అయితే సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల లోనే జరుపుతున్నారట. ఇక దీనితో పాటుగా రానున్న రోజుల్లో ఫస్ట్ సింగిల్ ని కూడా అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే దీని తర్వాత మెయిన్ టీజర్ ని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి అయితే ఈ సినిమాపై ఇప్పుడు మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు