ఆ హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. పిక్స్ వైరల్ !

ఆ హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. పిక్స్ వైరల్ !

Published on Nov 28, 2022 1:01 PM IST

నయనతార, విఘ్నేష్ శివన్ తర్వాత మరో కోలీవుడ్ జంట ఈరోజు పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం, నటి మంజిమా మోహన్ మరియు గౌతమ్ కార్తీక్ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ క్యూట్ కపుల్ వారి కుటుంబాల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. మంజిమా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. .

ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ రీస్టార్ట్ లో గౌతమ్‌తో తన వివాహం జరిగిందని మంజిమా మోహన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. వీరి కొత్త ప్రయాణం ఆనందంగా సాగాలని పలువురు సినీ ప్రముఖులు, మరియు నెటిజన్లు ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తూ మెసేజ్ లు చేసున్నారు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మంజిమా మోహన్ కి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు