మాస్టర్, విక్రమ్ చిత్రాల విజయాల తర్వాత తమిళంలో సెన్సేషనల్ డైరక్టర్ గా మారిపోయారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అతను విజయ్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్స్టర్గా కనిపిస్తాడని తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మొత్తం ముంబై నేపథ్యంలో సాగుతుందని సమాచారం. సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, లోకేష్ మొత్తం దేశం యొక్క సెన్సిబిలిటీకి సరిపోయేలా ఒక ఉమ్మడి స్థావరాన్ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది మరియు కొంతమంది పెద్ద పేర్లు ఈ ప్రాజెక్ట్లో చేరాలని భావిస్తున్నారు.