మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్ !

మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్ !

Published on Nov 14, 2022 8:10 PM IST

త్రివిక్రమ్‌ తో మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్‌లో ఉంది. అయితే, ఈ సినిమాపై వస్తున్న గాసిప్‌లు మాత్రం ప్రస్తతం అభిమానులను బాగా టెన్షన్‌ కు గురిచేస్తున్నాయి. త్రివిక్రమ్ కథ మొత్తం మార్చేస్తున్నాడని, పైగా ఈ సినిమా కోసం ఇప్పటికే తీసిన కొన్ని సీన్స్ ను కూడా స్క్రాప్ చేశాడని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కేవలం స్క్రిప్ట్‌లో త్రివిక్రమ్ కొత్తగా చేస్తున్న మార్పులు చేర్పులు కారణంగానే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ రూమర్స్ కేవలం ఊహాగానాలే అయినప్పటికీ, ఈ వార్తలు మాత్రం మహేష్ అభిమానులను బాగా టెన్షన్ పెడుతున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు