వారి కోసం ‘దేవర-2’ కథలో మార్పులు ?

వారి కోసం ‘దేవర-2’ కథలో మార్పులు ?

Published on Jan 26, 2025 8:00 AM IST

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓటీటీలో కూడా అద్భుతంగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. అయితే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమా కథలో చాలా మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

కాగా, ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక అప్ డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్నట్టు తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు