“చరణ్ 15” రిలీజ్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్.!

“చరణ్ 15” రిలీజ్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్.!

Published on Jan 29, 2023 10:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలన్స్ అయితే ఉంది. మరి ఇదిలా ఉండగా చరణ్ ఫ్యాన్స్ ఈ మాసివ్ ప్రాజెక్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తెలుస్తుంది.

మరి దీని ప్రకారం అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కే తీసుకురాబోతున్నారట. అయితే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయ్యిన షూట్ తో పోలిస్తే చాలా లేట్ అనే చెప్పాలి కానీ ఈ ఏడాది రిలీజ్ తో పోలిస్తే అప్పటికే పర్ఫెక్ట్ గా ఉంటుందని మేకర్స్ ఆలోచన కావచ్చు. సో మొత్తానికి అయితే ఈ అవైటెడ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు