మాస్ కటౌట్ తో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన “సర్కారు వారి పాట”

మాస్ కటౌట్ తో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన “సర్కారు వారి పాట”

Published on Apr 22, 2022 7:42 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా చిత్ర మాస్ కటౌట్ మహేష్ ఫోటో ను రిలీజ్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కి సంబందించిన అన్ని షూటింగ్ పార్ట్ పూర్తి అయింది అని, బాక్సాఫీస్ నుండి ఇక రికవరీ బాకీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ మాస్ కటౌట్ తో సూపర్ గా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను మే12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు