‘వీరసింహా రెడ్డి’ ప్రమోషన్స్ కోసం బాలయ్య సన్నద్ధం!

‘వీరసింహా రెడ్డి’ ప్రమోషన్స్ కోసం బాలయ్య సన్నద్ధం!

Published on Dec 26, 2022 10:00 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహా రెడ్డి’ ప్రమోషన్స్ కోసం సన్నద్ధం అవుతున్నారు. జనవరి 12, 2023 న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అందుకే, చిత్రబృందం వరుసగా సాంగ్స్ ను కూడా రిలీజ్ చేస్తోంది. అయితే, జనవరి ఫస్ట్ వీక్ నుంచే పలు ఇంటర్వ్యూలతో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ ను కూడా బాలయ్యతో ప్లాన్ చేశారట నిర్మాతలు. ఇందులో భాగంగానే ఏపీలోని పలు నగరాల్లో కూడా టీమ్ విజిట్ చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ఈ సారి భారీ ప్రమోషన్స్ చేయబోతున్నాడు.

ఇక శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ తన కెరీర్‌లో బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి. మరి ఈ జోడి స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు