త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే, అల్యూమినియం ఫ్యాక్టరీలో రేపటి నుంచి మహేష్ పై ఓ సోలో సాంగ్ ను షూట్ చేస్తారట. కొన్ని మాంటేజ్ షాట్స్ తీయడానికి ఇప్పటికే ఆల్ రెడీ సెట్ కూడా వేశారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట.
కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. జనవరి 13, 2024న రిలీజ్ ఈ సినిమా కానుంది.