సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే, ఈ మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ కామియో రోల్ లో కనిపిస్తారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ, ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ‘గుంటూరు కారం’ పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. అందుకే, బాలీవుడ్ లో ‘గుంటూరు కారం’ సినిమాకు డిమాండ్ రావడానికి ఈ స్పెషల్ కామియో రోల్ క్రియేట్ చేశారని టాక్.
మరోవైపు ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఫైట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అన్నట్టు రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ ని కంపోజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట. కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. జనవరి 13, 2024న రిలీజ్ ఈ సినిమా కానుంది.