మాస్ మహారాజా రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. అయితే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రవితేజ పాత్రకు సంబంధించి వచ్చే మెయిన్ ట్విస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. నాగేశ్వరరావు జీవితం ఎలా మలుపు తిరిగింది ?, అనే కోణంలో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట.
కాగా ఈ సినిమాలో రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తోంది. హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తోంది. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ కి స్ఫూర్తిని రగిలించే పాత్రలోనే రేణు దేశాయ్ కనిపించబోతుంది. ఇక ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. పైగా దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.