‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. కాగా సందీప్ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పాత్ర ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో రష్మిక మందన్నా ఒక సైన్స్ స్టూడెంట్ గా కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్ర మధ్య సైన్స్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే పుష్పతో నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు కానుంది. కాగా మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది.
మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్’ సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.