SSMB28లో విలన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు!

SSMB28లో విలన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు!

Published on Feb 12, 2023 10:47 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన జగపతి బాబు మహర్షి చిత్రం లో కీలక పాత్రలో నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రం లో కూడా నటించారు.

ఇప్పుడు ఈ స్టార్ యాక్టర్ మహేష్ 28వ చిత్రం లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు మహేష్‌తో మహర్షి మరియు త్రివిక్రమ్‌ల అరవింద సమేత వీర రాఘవలో విలన్‌గా నటించగా, ఈ రెండూ సూపర్‌హిట్ అయ్యాయి. ఆగస్ట్ 2023లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ బిగ్గీని భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే మరియు శ్రీలీల కథానాయికలు గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. SSMB28 కుటుంబ అంశాలతో కూడిన ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు