విజువల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో రాబోతున్న పీరియాడిక్ డ్రామా ‘ పొన్నియిన్ సెల్వన్’. కాగా ఈ చిత్రం పార్ట్-1 సెప్టెంబరు 30న విడుదల కానుంది. ఇక మొన్న జరిగిన ఓ ప్రీ- రిలీజ్ వేడుకలో విక్రమ్, కార్తీలు బాజాలు మోగిస్తూ అతిధులను స్వాగతించారు. అయితే, ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా విక్రమ్, కార్తీ లిద్దరూ బాజా మోగించడం బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజవ్వనుంది. ఈ సినిమా పై మణిరత్నం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘పొన్నియిన్ సెల్వన్-1, 2’ ఓటీటీ రైట్స్ రూ.128 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా, డిజిటల్ రైట్స్ను సన్టీవీ దక్కించుకుందట. ఇక ఈ సినిమాలో నటి ఐశ్వర్యరాయ్ విలన్ గా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఒకటి విలన్ పాత్ర అని కోలివుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఐశ్వర్య రాయ్ ని కోలివుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేసిన మణిరత్నం, ఇప్పుడు ఆమెను విలన్ గా కూడా పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రంతో ఐశ్వర్య లోని మరో నటనా కోణాన్ని చూస్తాం అంటున్నారు మేకర్స్.